దేశమంటే దేశమంటే
మతం కాదోయ్, గతం కాదోయ్
అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్నచేతి గన్ను కాదోయ్
క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్
తీవ్రవ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్
దేశమంటే
గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్
చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్
రాజధనుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్
అబలపై ఆమ్లాన్ని జల్లే అరాచకమే కాదు కాదోయ్
పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్
దేశమంటే
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు
హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు
క్రోధమెందుకు కరుణ పంచు
స్వార్ధమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు
కక్షలెందుకు కౌగిలించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు
రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు
కొత్త బంగరు భవిత నీదే కానుకందించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
దేశమంటే
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే
దేశమంటే మనుషులోయ్
'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్'... అని
నినదించిన ఘనుడు! తేట తెలుగు అక్షరాలను 'ముత్యాల సరాలు'గా పేర్చిన
కవివర్యుడు! పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కష్టాలకు పాట కట్టిన పరిపూర్ణుడు! నేటి
కాలపు మోసగాళ్లకు, ఒట్టి మాటగాళ్లకు ప్రతినిధిగా ఆనాడే 'గిరీశం' అనే
పాత్రను సృష్టించిన కలం యోధుడు... తెలుగు వారికి వెలుగు జాడై నిలిచిన
గురజాడ అప్పారావు 150వ జయంతి శుక్రవారమే. 1862 సెప్టెంబర్ 21న ఆయన
జన్మించారు. వర్తమానం నుంచి వందేళ్లు ముందుకెళ్లి రచనలు సాగించిన మహాకవి.
రవీంధ్రనాథ్ టాగూర్, భారతియార్ దేశభక్తి గీతాలు రాసినప్పటికీ వాటిలో
ప్రాంతాలు, దిక్కులు మాత్రమే ఉన్నాయి.
కానీ... గురజాడ 'దేశమంటే మట్టికాదు.. దేశమంటే మనుషులు' అని ఆ ఎల్లలు చెరిపేశారు.
"నన్న య్య గతం తెలిపిన రచయిత. శ్రీశ్రీ రచనలు భవిష్యత్ను తెలిపా యి. గురజాడ మాత్రం వర్తమానం తెలిపిన కవి. ఆయన తెలుగు వారి సోక్రటీస్''.
కానీ... గురజాడ 'దేశమంటే మట్టికాదు.. దేశమంటే మనుషులు' అని ఆ ఎల్లలు చెరిపేశారు.
"నన్న య్య గతం తెలిపిన రచయిత. శ్రీశ్రీ రచనలు భవిష్యత్ను తెలిపా యి. గురజాడ మాత్రం వర్తమానం తెలిపిన కవి. ఆయన తెలుగు వారి సోక్రటీస్''.
![]() | |
| from swapnamahi.blogspot.com |
ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుంది-గురజాడ అప్పారావు
- తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
- డామిట్! కథ అడ్డంగా తిరిగింది
- పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్
గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు.హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.
వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు.
జీవిత విశేషాలు:
గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం (ఎలమంచిలి) గ్రామంలో 1862 సెప్టెంబర్ 21 వ తేదిన అప్పారావు మతామహుల ఇంట జన్మించారు.. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. చీపురుపల్లి లో పదేళ్ళ వరకు చదివాడు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.1884 లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1885 లో అప్పలనరసమ్మ గారితో వివాహమైంది. 1886 లో డిప్యూటీ కలెక్టరు ఆప్ఫీసులో హెడ్ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించాడు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యత్వం లభించింది.
గిడుగు రామమూర్తి తో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు (ఖచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909 లో రచించాడు.
53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించాడు. ఆయనకు ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు.

No comments:
Post a Comment