Saturday, 30 April 2011

India - Scams gallery



India - Scams gallery


Jawaharlal Nehru 1947–1964

Jeeps scam

In the next year of independent India, first scam took place. VK Krishna Menon, who was high commissioner in Britain made a deal with foreign company for army jeeps by crossing the regulations. He had made the deal of Rs. 80,00,000 and this was found out in 1955 when he was in the ministry of Jawaharlal Nehru.

Cycles scam

Cycles imports scam took place in 1951. SA Venkataraman who was the industrial minister was bribed and he gave the permission to a foreign country for the sale of their company cycles.

BHU scam

BHU scam took place in 1956 and it was the first scam among the scams in educational institutions. Authorities of Banaras Hindu university wasted Rs. 50,00,000 of the treasury.

Mundra scam

Mundra scam which took place in 1957 was brought out by media. Haridas Mundra who belongs to Kolkata sold the shares of LIC by cheating the authorities. Jawaharlal Nehru who was the Prime Minister kept a case on him in Supreme court and it is declared that Mundra had sold non-existing shares which were of Rs.1.25 crores. LIC company was at a great loss. Mundra was punished for 22 years of jail sentence and the finance minster T.T. Krishnamachary resigned from the post.

Teja loan scam

Teja loan scam took place in 1960. Jayanth Dhramateja took Rs. 22 crores as loan to establish Jayanth Shipping company but without establishing the company, he ran with the money.

Kairan scam

In Kairan scam in 1963, Pratap Singn Kairan resigned the post of chief minister after one year when he was blamed that he was misusing the powers and facilities of the minister for his personal life.

Lal Bahadur Shastri 1964-1966

Biju Patnaik corruption

In Patnai Selfgoal in 1965, Odessa Chief Minister Biju Patnayak resigned the post as he gave the government project for his own company which is Kalinga tubes company.

Indira Gandhi 1966-1977

Maruthi controversy

Indira Gandhi’s name was shouted out in Maruthi scam in 1974 that she was giving the license of the cars to her son Sanjay Gandhi before the company was established.

Indian oil scam

Indian Oil scam in 1976 was done by Indian oil company. It had made agreements with the Hongkong company which was not in existence and took bribes.

A R Anthule corruption

A.R. Anthule who was the chief Minister of Maharashtra in Past had taken Rs. 30 crores from the cement company and kept this money in a private trust.

Indira Gandhi 1980-1984

Churhat lottery scam

Churhat lottery scam involving Congress minister Arjun singh

Rajiv Gandhi 1984-1989

HDW submarine scam

See HDW submarine scam. HDW commissions scam was found in 1987 and in this scam, HDW submarine company had given Rs. 20 crores as commissions. So this company was blocked. The case was closed in 2005.

Bofors scam

See Bofors scam. Bofors scam took place in 1987 and Bofors Swedish company had said that it had given Rs. 64 crores of bribe to the Rajiv Gandhi and other popular people in India.

Saint Kits forgery

Saint Kits forgery took place in 1989 and forgery was done to show that VP Singh was also partner in the Rs.2.1 crores which was in his sons account in Saint Kits first trust corporation.

Indian Airlines controversy

Indian Airlines made Rs. 2000 crores contract with Airbus company even after A-320 flight accident. Flights were not issued but Rs.2.5 crores was the loss incurred.

PV Narasimha Rao 1991-1996

Solamki scam

Solamki scam took place in 1992. In this scam, Madhav Singh Solamki who was the foreign affairs minister had resigned the post as his letter to Switzerland foreign Affairs Minister was published by India Today magazine.

Securities scam

Securities scam in 1992 was done for Rs. 5000 crores. In this scam, Harshad Mehta had made the made the banks to invest the company’s money in various fields in stock market. Loss was incurred.

Indian Bank scam

See Indian Bank scam. Few popular people and other famous people took Rs. 1300 crores of loan from the Indian bank with the help of Indian bank chairman M.Gopala Krishna and did not pay back.

Sugar imports scam

Sugar imports scam in 1994 was another scam. Past Health minister Kalpanth Rai had imported the sugar for more price than the market price and as a result, there was Rs. 650 crores loss to the treasury.

MS Shoes scam

See MS Shoes scam. MS shoes scam also took place in 1994. Pavan Sachdev who was the owner of MS Boots company had bought the shares at very low price along with SB and SBI cops. So people had invested Rs. 699 crores in the shares.

JMM bribery

JMM bribes scam took place in 1995 and in this JMM had agreed that he and other three MPs had taken Rs. 30,00,000 to protect the P.V. Narasinha Rao government.

Lakhubhai Pathak cheating case

England-based NRI pickle king Lakhubhai Pathak, alleged that ‘godman’ Chandraswami and K N Aggarwal alias Mamaji, cheated him of $100,000 in 1983, promising they would get him a paper pulp supply contract. He accused P V Narsimha Rao, then minister in the Congress government.

Sukram corruption

There were rumors that Sukhram who was communication minister had agreed to buy the telecom devices from a company in Hyderabad and there was Rs.1.6 crore loss incurred for the government treasury. This scam took place in 1996.

Fodder scam

See Fodder scam. Bihar Animal Husbandry department withdrew Rs. 950 crores from the treasury for animal feeding in 1996. After one year, Lalu Prasad Yadav had resigned the post as he was also one of the partners in the scam.

Urea scam

Urea agreement in 1996 was another scam in that year. CS Ram Krishnan had taken Rs. 133 crores from the government to supply urea but he did not supply urea.

Hawala scam

See Hawala scam. Hawala diaries scam took place in 1996 and it was brought in CBI ride on Hawala operators. SK Jain Diaries were a sensation in this scam.

IK Gujral 1997

CRB scam

CRB scam took place in 1997. Roop Bansali had established Pyramid business company and collected thousand crore rupees of deposits. He had also got one banking license and when State bank authorities had found that there was no money for the warrants he had shown, scam was found out. By this time, small investors were at loss.

Companies scam

  • Non-existence of Companies scam took place in 1998. Finance minister Chidambaram came to know that hundreds of companies had collected people’s money and when he enquired, 600 companies were not existing. In this 80 companies had collected Rs. 330.78 crores of money and disappeared.

AB Vajpeyee 1998-2004

Mohata scam

Mohata entered in other scam again in 1998. He increased value of Videocon, BPL and sterilite company shares along with their promoters. When the shares value had fell, Mohata was debarred for the lifetime.

Plantation scam

Plantation company scam took place in 1999 and in this scam, 653 companies had collected Rs. 2,563 crores of amount from the people. Apart from profits and interests, people could not get the invested money also.

Match fixing scam

See Match fixing scam. Match fixing scam in the year 2000 took place in Cricket history. There were rumors that Azaruddin, Ajay Jadeja and Prabhakar had taken money and did match fixing.

Coffin scam

Ketan Parekh

Ketan Parekh scam took place in 2001 and he was great at scams than Mohata. Mohata had used the receipts of the banks but Ketan had used the pay orders to do the scam. He incurred loss to the HFCL (Rs.425 crores) and Zee companies (Rs. 340 crores) along with banks. Kethan Farakh had made one lakh fifteen thousand crores of money disappear from the stock market. In 2002, Farakh was arrested and he was abandoned from the stock market.

Tehelka operation

Tehelka operation was done in 2001 and in this operation, it had used secret spy cameras and brought many issues into limelight. Military people and political leaders were present in the issues.

Home trade scam

See Home trade scam. Home trade scam took place in 2002 and Home trade which belongs to Navi Mumbai company had taken Rs. 600 crores from Maharashtra and Gujarat banks. Company CEO Sanjay Agarwal was arrested.

Stamp paper scam

See Stamp paper scam. Stamp papers scam in 2003 incurred a loss of Rs. 30,000 crores to Indian treasury. There were police officials and other higher officials.

Manmohan Singh 2004 till present

Oil for food scam

Oil scam for food took place in 2005 and K.Natwar Singh was dismissed from the duty after finding the oil scam with Iraq for food.

Satyam scam

Madhu Koda corruption

See Madhu Koda Congress supported his govt in Jharkhand] [2009]

MHADA flats scam

Mhada flats in Mumbai. Congress government constructed posh flats using public money and gave away flats to its members flouting rules.

Siachen army ration scam

Cash for votes scam

IPL scam

Sukna land scam

2G scam

See 2G scam

Karnataka landscam

Commonwealth games scam

Adarsh society scam

ISRO Devas scam

Pune landscam

Fake pilots scam

Other scams

And the list continues to grow..


--

సాయి చుట్టూ కసాయిలు !!

సాయి చుట్టూ కసాయిలు !!



ఎప్పటి నుంచో ట్రస్టులో ముఠాలు


దేవాంతకులు -1
బాబాపై హత్యాయత్నానికి కారణమిదే!
ప్రశాంతి నిలయంలో ఆరు హత్యలు
కట్టలు కట్టలు డబ్బు మాయం
1993 నుంచీ వీడని మిస్టరీ
అంతర్గత వ్యవహారమన్న సభ్యుడు
ఆగిపోయిన పోలీసు విచారణ
బంగారం, డబ్బు తరలించేసినట్లు వచ్చిన వార్తలు అబద్ధమంటోంది ట్రస్టు...

మరి గతాన్ని పరిశీలిస్తే... ప్రశాంతి నిలయంలో కనిపించిన వందలకొద్దీ అయిదొందల రూపాయల, డాలర్ల నోట్ల కట్టలు రాత్రికి రాత్రి మాయమయ్యాయి. 

ఈ విషయం చెప్పింది సాక్షాత్తూ ఒక పోలీసు అధికారి!
ప్రశాంతి నిలయంలో ప్రత్యర్థి వర్గాల మధ్య తీవ్ర విభేదాలు లేవంటోంది ట్రస్టు...
గతాన్ని తరచిచూస్తే అవి చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రమైనవంటే ఒకే రాత్రిలో ఆరు మరణాలకు దారితీసేంత! ఈ విషయం చెప్పింది సాక్షాత్తూ ఒక ట్రస్టు సభ్యుడు.

ట్రస్టు వ్యవహారాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండదంటోంది ట్రస్టు...
గతాన్ని బట్టి చూస్తే ఇదొక్కటి మాత్రమే పచ్చి నిజం. ట్రస్టు ఆస్తుల వ్యవహారాలే కాదు, ప్రశాంతి నిలయంలో ఏం జరిగినా, చివరికి హత్యలు జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు. ఈ హత్యలు తమ అంతర్గత వ్యవహారమని, దర్యాప్తు సంస్థలు వేలు పెట్టక్కర్లేదని ట్రస్టు సభ్యులు నిర్లజ్జగా ప్రకటనలు ఇచ్చేసినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు ఉండదు.

"సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుల మధ్య విభేదాల్లేవు. అంతా మీడియా సృష్టే. బంగారం, విలువైన వస్తువులు, డబ్బు తరలించేసినట్లు వచ్చిన వార్తలు బాధ్యతారహితమైనవి''... ట్రస్టు సభ్యులు గురువారం పుట్టపర్తిలో విలేకరుల సమావేశంలో పలికిన పలుకులివి. అయితే ఈ పలుకుల్లో ఏ ఒక్కటీ వాస్తవమని నమ్మలేం. గతమే దానికి సాక్ష్యం.

హైదరాబాద్, ఏప్రిల్ 29 : అది ప్రశాంతి నిలయం. అక్కడ ఏం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు, పట్టించుకోకూడదు. 86 ఏళ్ల వృద్ధుడైన బాబా అనారోగ్యంతో బాధపడుతున్నా ట్రస్టు సభ్యులెవరూ పట్టించుకోరు. బాబాకు ఎవరు వైద్యం చేస్తున్నారో, ఆయన ఏ మందులు వేసుకుంటున్నారో కూడా ఎవరూ పట్టించుకోరు. బయటి వారెవరైనా పట్టించుకుంటే ఊరుకోరు. మీడియా ప్రశ్నిస్తే కస్సున లేస్తారు. బాబా ఆరోగ్యం విషయమే కాదు.. ప్రశాంతి నిలయంలో దారుణమైన మరణాలుసంభవించినప్పుడు కూడా ఇదే సూత్రం. అక్కడేం జరిగినా ఎవరూ పట్టించుకోకూడదు. హత్యలు జరిగినా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకూడదు. ఏదైనా వారి అంతర్గత వ్యవహారంగానే పరిగణించాలి.

తాము అనుసరించేది సత్యసాయి బాటేనని, ట్రస్టులో ఎటువంటి విభేదాలు లేవని సభ్యులందరూ ప్రకటనలు చేస్తుండవచ్చు. కానీ, ట్రస్టుకు ఉన్న కోట్లాది రూపాయల ఆస్తుల కోసం కుమ్ములాటలు ఎంతోకాలంగా సాగుతుండటం నిజం. ఒక్కప్పుడు ట్రస్టు సభ్యుల మధ్య చెలరేగిన విభేదాలు - సత్యసాయి ప్రాణాలనే ప్రమాదంలో పడేసే స్థాయికి చేరుకున్నాయి. 1993 జూన్ 8వ తేదీన ప్రశాంతి నిలయంలో ఆరుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురికావడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కలగజేసుకొని కేసులు లేకుండా చేశారు.

ఈ హత్యలపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 18 ఏళ్లు గడిచినా చార్జిషీట్లు మాత్రం దాఖలు చేయలేదు. ప్రభుత్వం ఆదేశించిన సీబీసీఐడీ విచారణ కూడా సగంలోనే ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాలు సజావుగా జరగటం కోసం సాయిబాబా ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. 1993లో ఈ ట్రస్టుకు నారాయణన్ కార్యదర్శిగా వ్యవహరించేవారు. 

కల్నల్ జోగారావు, ఆర్వీ జానకి రామయ్య (బాబా సోదరుడు), కె.ఆర్.ప్రసాద్, ఇందులాల్ షా, శ్రీనివాసన్, రాజమాత, జస్టిస్ పి.ఎన్.భగవతి, జస్టిస్ బాలకృష్ణ ఎరాడేలు సభ్యులుగా ఉండేవారు. ఆ సమయంలో వివిధ పత్రికల్లో వెలువడిన కథనాలను పరిశీలిస్తే... ఈ ట్రస్టులో రెండు వర్గాలు ఉండేవని స్పష్టమవుతుంది. సత్యసాయి సోదరుడు జానకి రామయ్య, ఆయన కుమారులు సాయిబాబాపైన, ట్రస్ట్‌పైన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు. 

సాయి తమకు బంధువు కాబట్టి ట్రస్ట్ వ్యవహారాలలో తమదే పైచేయి కావాలని వారు వాదిస్తూ ఉండేవారు. కల్నల్ జోగారావు, నారాయణన్‌లు ఒక వర్గంగా వ్యవహరించేవారు. కల్నల్ జోగారావుకు సాయి దగ్గర మంచి సాన్నిహిత్యం ఉండేది. నారాయణన్ కార్యదర్శి కాబట్టి ట్రస్టు వ్యవహారాలపై ఆయనకు పట్టు ఉండేది. ఇది జానకి రామయ్యకు రుచించేది కాదని, అన్ని వ్యవహారాలు తన కనుసన్నలలోనే జరగాలని భావించే వారని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత కల్నల్ జోగారావుకు, ఇతర సభ్యులతో విభేదాలు వచ్చాయి. జానకి రామయ్య, కల్నల్ జోగారావు సన్నిహితులయ్యారు.

పోలీసుల కథనం: ఈ నేపథ్యంలో.. 1993 జూన్ 8వ తేదీన ప్రశాంతి నిలయంలో ఒక దాడి జరిగింది. ఆరుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై పోలీసులు వినిపించిన కథ ఇలా సాగింది.... "రాత్రి 10.30కి ఆరుగురు వ్యక్తులు సాయిబాబా వ్యక్తిగత మందిరంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవటానికి అప్పుడు మందిరంలో ఉన్న రాధాకృష్ణ, సాయికుమార్ మహాజన్, అనీల్ పాట్లే, విష్ణు అనే సాయి సేవకులు ప్రయత్నించారు. దుండగుల దాడిలో రాధాకృష్ణ, సాయికుమార్ మహాజన్‌లు మరణించారు.

దాడి చేసిన వారిలో ఇద్దరు పారిపోగా, మరో నలుగురు దుండగులు మందిరంలోని ఫస్ట్ ఫ్లోర్‌లోకి ప్రవేశించారు. ఈ విషయం తెలిసిన వెంటనే సాయి సోదరుడు జానకి రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సీఐ గంగాధర్ రెడ్డి మందిరానికి చేరుకొని దుండగులను లొంగిపొమ్మన్నారు. కానీ, వారు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జగన్, సురేష్ కుమార్, సాయిరాం, ప్రభు అనే నలుగురు దుండగులు మరణించారు.''

వాళ్లని చంపెయ్యండి
అయితే, ఈ దాడులు కేవలం ట్రస్ట్ సభ్యుల మధ్య ఉన్న విభేదాల వల్లే జరిగాయని ఆ తర్వాత వారు చేసిన వ్యాఖ్యలు, పరిణామాల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా, ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షుల కథనాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. వీటి ప్రకారం- దాడి జరిగిన వెంటనే మందిరానికి ఎదురుగా ఉన్న హాస్టల్ నుంచి 60 మంది ఎంబీఏ విద్యార్థులు పెద్దగా అరుచుకుంటూ వచ్చారు.

నిందితులుగా పేర్కొంటున్న నలుగురిపై దాడి చేశారు. వారిని నిరాయుధులను చేసి కట్టేశారు. "మేం బాబాను రక్షించడానికి వచ్చాం'' అని ఆ నలుగురూ గట్టిగా అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. బాబా గది నుంచి బయటకు వచ్చిన బాబా సోదరుడు జానకి రామయ్య- "వాళ్లని చంపెయ్యండిరా'' అని అరవడం మొదలుపెట్టారు. ఈ లోపు పోలీసులు వచ్చారు. వారితో జానకి రామయ్య ఏదో మాడ్లాడారు. పోలీసులు వెళ్లి నిరాయుధులైన నలుగురిని కాల్చి చంపేశారు.

జానకి రామయ్య రోదన..
ఈ సంఘటన జరిగిన మర్నాడు సాయంత్రం అప్పటి కేంద్ర హోంమంత్రి ఎస్.బి.చవాన్ ప్రశాంతి నిలయానికి వచ్చి సాయిబాబాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పోలీసుల కథనంలో ఎటువంటి మార్పు లేకపోయినా- ట్రస్టు సభ్యులు మాత్రం తమ ప్రత్యర్థి వర్గాలపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. "బాబా తన కుటుంబానికి ఎప్పుడూ ఏదీ చేయలేదు. మిగిలిన వారికే అన్నీ చేశారు. వారు ఇప్పుడు ఆయనపై దాడికి ఎలా దిగారో చూడండి?'' అని తనను కలిసిన 'హిందుస్థాన్ టైమ్స్' రిపోర్టర్ వద్ద బాబా సోదరుడు జానకి రామయ్య కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. 

బాబా బయటి వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారని, వారి అసలు రూపం ఇప్పటికైనా తెలిసింది కాబట్టి- ఇకపైనైనా బంధువులకు ప్రాముఖ్యం ఇవ్వాలని బాబా మరో బంధువైన ఆర్.విశ్వనాథ్ కూడా అభిప్రాయపడ్డారు. ఇక ట్రస్టు సీనియర్ సభ్యుడైన ఇందూలాల్ షా తన వ్యాఖ్యల ద్వారా అసలు విషయాన్ని బయటపెట్టారు. "ఇది బాబాపై జరిగిన దాడి కాదు. మా ప్రాంగణంలో రెండు వర్గాల విభేదాలకు సంబంధించినది'' అని స్పష్టంగా చెప్పారు. పైగా ఆయన ఒక దారుణమైన వ్యాఖ్య కూడా చేశారు. "ఇది ట్రస్టు అంతర్గత వ్యవహారం. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ జరపాల్సిన అవసరం లేదు'' అని నిర్లజ్జగా చెప్పారు.

డబ్బు.. డబ్బు. డబ్బు
ప్రశాంతి నిలయంలోకి పైసా ధనం కూడా తీసుకోరని, విరాళాలు చెక్కుల రూపంలోనే ఉంటాయని, ప్రతి పైసాకు రికార్డు ఉంటుందని ట్రస్టు సభ్యులు చేసే ప్రకటనలలో డొల్లతనం కూడా నాటి ఘటనతో బయటపడింది. దాడి జరగక ముందు ట్రస్టు సభ్యుడొకరు సాయితో సమావేశమవటానికి మందిరంలోకి వెళ్లారు. అక్కడ వందల సంఖ్యలో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు, రూ. లక్షల విలువ చేసే డాలర్ కట్టలు ఉన్నాయి. సంఘటన తర్వాత ఆ సొమ్ము మాయమైంది. ఈ విషయాన్ని అప్పటి సీఐ గంగాధర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.

సంపదే కారణం
1992 ముందు సత్యసాయికి ఇ.కె.సురేష్ అనే వ్యక్తి వ్యక్తిగత సహాయకుడిగా ఉండేవాడు. అతనికి సాయితో పదిహేనేళ్ల అనుబంధం. బాబా చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు అతనికి తెలియకుండా జరిగేది కాదు. ఒక విధంగా అతడు సర్వ శక్తిమంతుడు అయ్యాడు. ఆ సమయానికే ట్రస్టులో విభేదాలు బాగా ముదిరిపోయాయి. కొందరు ట్రస్టు సభ్యులు చేసే అవినీతి గురించి సురేష్ బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

'మీరు చేస్తున్న పనుల గురించి బయట పెడతా' అని కొందరు సభ్యులను బెదిరించటం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితుల్లో సురేష్ స్థానంలో రాధాకృష్ణ సాయి వ్యక్తిగత సహాయకుడిగా నియమితులయ్యారు. అప్పటి కథనాల ఆధారంగా చూస్తే- సాయి సహాయకుడిగా ఉన్న రాధాకృష్ణకు కూడా ట్రస్టుకు సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. అతడి అడ్డును తొలగించటానికి కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే 'కాల్పుల' ఘటన జరిగిందని సమాచారం.

బాబా మౌనం
ఈ మొత్తం సంఘటనపై బాబా మౌనంగానే ఉన్నారు. దీని వెనక కూడా ట్రస్టు సభ్యుల హస్తం ఉందని కథనాలు వచ్చాయి. "మీరు పత్రికల వాళ్లతో మాట్లాడితే యక్ష ప్రశ్నలు వేస్తారు. లేనిపోనివి రాసి పరువు, ప్రతిష్ఠ గంగలో కలుపుతారు'' అని ఒక ట్రస్టు సభ్యుడు బాబాతో చెప్పారు. దీంతో ఈ వ్యవహారంపై బాబా మౌనంగా ఉన్నారనే కథనాలు వెలువడ్డాయి.

Wednesday, 27 April 2011

మనుషులు చేసిన దేవుళ్లు..

మనుషులు చేసిన దేవుళ్లు
- ఆదిత్య

దేవుడిని నమ్ముకోవాలా? అమ్ముకోవాలా? ఎవరైనా నమ్ముకోవాలనే చెబుతారు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. బాబాలే కాదు.. దేవుళ్లు కూడా ప్రచారాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితులు! 'గాడ్' వేరు. 'గాడ్ మ్యాన్' వేరు. ఒక నమ్మకం.. ఒక బలహీనత.. ఒక నిస్సహాయత.. వెరసి గాడ్‌ను మించిన గాడ్ మ్యాన్లు పుట్టుకు వస్తున్నారు.

గాడ్ మ్యాన్‌ని 'చిత్రపు స్వామి' అని కూడా పిలుచుకోవచ్చు. "సర్వం ఖల్విదం బ్రహ్మ'' అంటారు. కానీ, కొందరు చిత్రపు స్వాములు మాత్రం దేవుళ్లుగానే చలామణి అవుతున్నారు. వాస్తవానికి, ఈ చిత్రపు స్వాములకు తాము దైవం కంటే అధికమన్న భావన ఉండదు. కానీ, వారి చుట్టూ చేరే కొంతమంది భక్త (భజన) బృందం మాత్రం వారిని దైవంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. దీనితో ఆయా వ్యక్తులు గాడ్‌గా చలామణి అవుతూ ఉంటారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఇందులో ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ఒక వ్యక్తి కొన్ని మహిమలు లేదా తాంత్రిక విద్యలు నేర్చుకున్నారనుకుందాం. తనను గురించి తానే ప్రచారం చేసుకుంటే ప్రయోజనం ఉండదు కనుక, కొంత మంది శిష్య బృందాన్ని పోగేసుకుంటారు. ఈ శిష్య బృందం సదరు వ్యక్తిని గాడ్ మ్యాన్‌గా ప్రచారం చేయడం ప్రారంభిస్తుంది. దీనితో ఒక గాడ్ మ్యాన్ అవతరిస్తాడు. ఈ దశ వరకు గాడ్ మ్యాన్‌కు శిష్యులు ఉపయోగపడతారు.

ఆ తరువాత దశలో సదరు గాడ్ మ్యాన్‌ను శిష్యులు ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. అంటే, ఉభయ కుశలోపరి సిద్ధాంతాన్ని ఆచరిస్తారన్న మాట! అయితే, గాడ్ మ్యాన్ పాపులర్ అయిన తర్వాత అసలు చిక్కు మొదలవుతుంది. గాడ్ మ్యాన్ క్రమంగా తన స్వతంత్రాన్ని కోల్పోతాడు. కోటరీగా ఏర్పడే భక్త బృందం చేతిలో బందీగా మారతాడు. గాడ్ మ్యాన్‌కు ఎన్ని మహిమలు ఉన్నా, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి.

ఈ బలహీనతలనే కోటరీ సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకుని గాడ్ మ్యాన్‌ను తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు. అక్కడ నుంచి గాడ్ మ్యాన్‌ను అమ్ముకోవడం ప్రారంభిస్తారు. ఈ లోపు ఏ ప్రయోజనాలనూ ఆశించని అమాయక భక్తులు కూడా తయారవుతారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రయోజనం పొందేది మాత్రం, గాడ్ మ్యాన్‌తో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీ మాత్రమే.

పుట్టపర్తిలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వెలుగొందిన సత్యనారాయణ రాజు అలియాస్ సత్యసాయి బాబాను గాడ్ మ్యాన్ అంటే భక్తులు ఒప్పుకోకపోవచ్చు. కానీ, గాడ్‌కి, గాడ్ మ్యాన్‌కి కచ్చితంగా తేడా ఉంటుంది. సాయిబాబా విషయమైనా అంతే! ఎందుకంటే, సాయిబాబానే స్వయంగా కలియుగ దైవంగా కీర్తించబడుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తారు. అంటే, తాను దేవుడిని కానని బాబాకు తెలుసు.

తాను సామాన్యుడినని బాబానే స్వయం గా ఒక సందర్భంలో ప్రకటించుకున్నారు. అయినా, తెలియనట్టు నటిస్తున్నది ఆయన చుట్టూ ఉన్న కొంతమంది కోటరీ సభ్యులే! అందుకే, అనారోగ్యంతో చివరి క్షణాలు గడుపుతున్న బాబాకు ఏమీ కాదని, ఆయన మరింత కాలం జీవిస్తారని భక్తులు విశ్వసించేటట్లు చేస్తున్నారు. బాబా దేవుడే అయితే ఈ అవతారాన్ని ఫలానా రోజు చాలిస్తున్నట్లు ముందుగానే ప్రకటించి ఉండవచ్చు. కానీ, అలా జరగలేదు కనుక ఆయన్ని గాడ్ మ్యాన్‌గానే పరిగణించవలసి ఉంటుంది.

బాబా కోరుకుంటే తనంతట తాను స్వస్థత చేకూర్చుకోగలరని రిటైర్డు ఐ.పి.ఎస్. అధికారి వి.అప్పారావు వంటి వాళ్లు వ్యాఖ్యానించ డం లేదా విశ్వసించడం విడ్డూరంగా ఉంది. పోలీసు శాఖలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన అప్పారావు వంటి వాళ్లు హేతుబద్ధత లేని వ్యాఖ్యానాలు చేయడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు.

వాళ్లంతా తమకు బాబా వల్ల మేలు జరిగిందని చెబుతూ ఉంటారు. మేలు జరగకపోతే బహు శా వాళ్లు కూడా బాబాను భగవాన్‌గా సంబోధించే వారు కాదేమో! తన వేళ్లకు ఉన్న బంగారు ఉంగరాలన్నీ, చేతికి ఉన్న వాచీతో సహా బాబా ఇచ్చినవేనని అప్పారావు చెప్పుకొన్నారు. వాస్తవానికి సత్య సాయిబాబా జీవితంతోపాటు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఎన్నో వివాదాలమయం.

తన ట్రస్టుకు సమకూరుతున్న విరాళాల నుంచి కొంత మొత్తాన్ని వెచ్చించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం మొదలైన తర్వాతే బాబాకు విమర్శకులు తగ్గి, అన్ని వర్గా ల ప్రజలలో గౌరవం పెరిగింది. అయితే, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, అధికారులు, రాజకీయ ప్రముఖులు మాత్రమే బాబాకు సన్నిహితంగా మెలగగలిగారు. ఇలా బాబాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు ఏదో ఒక ప్రయోజనం చేకూరిన సందర్భాలు ఎన్నో ఉన్నా యి. అలా అని ఆయనను నిజంగా నమ్మిన నిస్వార్థ భక్తులు ఎవరూ లేరని చెప్పడం లేదు.

బాబా కూడా తనకు సన్నిహితమైన ప్రముఖ భక్తులకు ఏదో ఒక మేలు చేయడానికి ఎన్నడూ వెనుకాడలేదు. ఉదాహరణ కు బాబాకు పరమ భక్తుడైన రిటైర్డ్ ఐ.పి.ఎస్. అధికారి హెచ్.జె.దొర డి.జి.పి.గా నియమితులు కావడం వెనుక బాబా పాత్ర ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సం ఘటన జరిగింది. దొర జూనియర్ అయినందున సీనియర్ అధికారిని డి.జి.పి.గా నియమించాలని నిర్ణయించడం జరిగింది.

కానీ, తెల్లారేలోపు చంద్రబాబు నిర్ణయం మారిపోయిం ది. బాబా నుంచి వచ్చిన ఫోన్‌కాల్ వల్ల జూనియర్ అయినప్పటికీ దొరను డి.జి.పి.గా నియమించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అలాగే, బాబా సామాన్య భక్తుల విషయంలో ఒకలా, ప్రముఖుల విషయంలో మరోలా వ్యవహరించేవారు.

సామాన్య భక్తులు దర్శనానికి వస్తే విభూతి ఇచ్చి సరిపెట్టేవారు. అదే మంత్రులు లేదా ఉన్నతాధికారులు లేదా పౌర ప్రముఖులు వెళితే బంగారపు ఉంగరాలు, గొలుసులు లేదా రిస్ట్ వాచీలు బహూకరించేవారు. అంతేకాదు, ప్రశాంతి నిలయంలో పకడ్బందీ నెట్‌వర్క్ పనిచేస్తూ ఉంటుంది. బాబా దర్శనం కోసం వచ్చేవారి వివరాలు, వారు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుని ఈ నెట్‌వర్క్ బాబాకు చేరవేస్తుంది.

ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. 1994కు ముందు మిత్రుడు ఒకరికి పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనను పరామర్శించడానికి నాటి మంత్రి హరిరామ జోగయ్యతో పాటు నేనూ వెళ్లాను. మంత్రి ఆస్పత్రికి వచ్చిన విషయం ఎలా తెలిసిందో గానీ, మేం ఆస్పత్రికి వెళ్లే లోపే మంత్రికి గౌరవ మర్యాదలు చేయడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. మా మిత్రుడిని పరామర్శించిన తర్వాత సాయంత్రం అందరితో పాటు మేం కూడా బాబా దర్శనం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చున్నాం.

బాబా వచ్చారు.. వెళ్లారు. కొంతసేపటికి హరిరామ జోగయ్యకు పిలుపు వచ్చింది. ఆయనను మాత్రమే బాబా సందర్శనకు అనుమతించారు. అప్పట్లో నేను విలేకరిని మాత్రమే కనుక నాకు ఆహ్వానం లేదు. బాబా యధావిధిగా జోగయ్యకు నవరత్నాల ఉంగరాన్ని బహూకరించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదనీ, 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాలంటూ నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డికి సూచించవలసిందిగా కోరారు. బాబా రాజకీయాలు మాట్లాడడంతో ఆశ్చర్యపోవడం జోగయ్య వంతు అయింది. అయి తే, బాబాను చిత్తశుద్ధితో నమ్మేవాళ్లు కూడా అందుకు బలమైన కారణాలనే చెబుతూ ఉంటారు.

నాకు తెలిసిన ఒక మిత్రుడు తన అనుభవాన్ని ఈ సందర్భంగా వివరించారు. తన కుమారుడికి మద్రాసులో ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించి సాధ్యపడకపోవడంతో సదరు మిత్రు డు హైదరాబాద్‌లోనే చేర్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ సమయంలోనే తాను బాబా దర్శనానికి వెళ్లాననీ, 'నీ కుమారుడికి మద్రాసులోనే సీటు వస్తుందిలే' అని బాబా అన్నారనీ, అలాగే పదిరోజుల తర్వాత సదరు కళాశాల నుంచి సీటు ఇస్తున్నట్లు కబురు వచ్చిందని ఆ మిత్రుడు వివరించారు. ఇది బాబా మహిమగా ఆయన నమ్ముతున్నారు.

నా మిత్రుడి కుమారుడికి మద్రాసులో ఇంజనీరింగ్ సీటు కావాలన్న విషయం ముందుగానే తెలుసుకుని తన పలుకుబడితో ఆ సీటు ఇప్పించి ఉండవచ్చు కూడా! ఏది ఏమైనా ఆ మిత్రుడికి మంచే జరిగింది కనుక, దాని లోతుపాతుల్లోకి ఇప్పుడు వెళ్లడం అనవసరం. సత్య సాయిబాబాను వేలెత్తి చూపడానికో, తప్పు పట్టడానికో ఇవన్నీ చెప్పడం లేదు. ఎవరి నమ్మకం వారిది.

కాదనే హక్కు ఎవరికీ లేదు. అయితే గాడ్‌కి, గాడ్ మ్యాన్‌కి తేడా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. తెలుగుగంగ ప్రాజెక్టు విషయమై నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైదరాబాద్ వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పుట్టపర్తి వెళ్లి సత్యసాయి బాబాను దర్శనం చేసుకుందామని చంద్రబాబు అనగా, "నేను గాడ్‌ను నమ్ముతానుగానీ, గాడ్‌మెన్‌ను నమ్మను'' అని జయలలిత స్పష్టంగా చెప్పారు.

బాబాకు బంగారం పట్ల ఆసక్తి లేదనీ, బంగారం, నగలు ప్రశాంతి నిలయంలో స్వీకరించరనీ, చెక్కుల రూపంలోనే విరాళాలు స్వీకరిస్తారనీ అప్పారావులాంటి భక్తులు చెబుతున్నారు. కానీ, వాస్తవం అందుకు విరుద్ధం. బాబా నివసించే యజుర్మందిరంలోనే పలు గోడలకు బంగారు రేకులతో తాపడం చేయించారు. అంతెందుకు, 1993లో ముఖ్యమంత్రిగా ఉన్న విజయభాస్కర రెడ్డి బాబా దర్శనానికై పుట్టపర్తి వెళ్లారు.

అప్పుడు బాబా గదిలో బంగారం బిస్కెట్లు, నగలతో కూడిన పలు మూటలు ఉన్న విషయాన్ని గమనించిన ఒక అధికారి, ముఖ్యమంత్రితో బయటకు వచ్చిన తర్వాత అదే మాట చెప్పారు. "నేనూ చూశాను. అయినా, ఆ విషయాలన్నీ మనకు ఎందుకు?''అని విజయ భాస్కరరెడ్డి వ్యాఖ్యానించారు. కాలక్రమంలో బాబా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆయనకు శాశ్వత కీర్తిని మిగల్చనున్నాయి. ప్రస్తుతం బాబా అనారోగ్యంతో పడుతున్న బాధను చూస్తూ ఉంటే ఆయన సుఖపడింది ఏమీ లేదని స్పష్టం అవుతోంది. బాబాను గ్లోరిఫై చేయడం కోసమే ఆయన చుట్టూ ఉన్న ట్రస్టు సభ్యులుగానీ, కోటరీ సభ్యులుగానీ బంగారు రథాల వంటివి తయారు చేయించి ఆర్భాటానికి పాల్పడి ఉండవచ్చు.

ఒక్క సత్యసాయి బాబా విషయంలోనే కాదు, పలు ఇతర స్వాముల విషయంలో కూడా ఇలాంటి ఆర్భాటాలను మనం చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక గురువులుగా చలామణి అవుతున్న వారుగానీ, మత గురువులు గానీ ఇలాంటి ఆర్భాటాలను స్వయంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆర్భాటం లేకపోతే తమకు గొప్పవాళ్ళుగా గుర్తింపు రాదని వారు భావిస్తూ ఉండవచ్చు. గణపతి సచ్చిదానంద స్వామినే తీసుకుందాం. ఎవరైనా భక్తుడి ఇంటికి వెళ్ళాలన్నా, కాళ్లు కడిగించుకోవాలన్నా ఆయన డబ్బు తీసుకుంటారు.

ఇక, కల్కి భగవాన్‌గా చలామణి అవుతున్న కల్కి దంపతుల ఆడంబర జీవితం గురించి తెలిసిందే! ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయవలసిన స్వాములకు, బాబాలకు డబ్బుతో అవసరం ఏమిటో తెలియదు. స్వార్థాన్ని విడనాడాలనీ, కోర్కెలను త్యజించాలనీ ప్రవచించే స్వాములెందరో విలాసవంతమైన జీవితాలనే గడుపుతూ ఉండటం విశేషం. ఈ క్రమంలో తమను తాము దైవం కంటే అధికమని భావించేవాళ్లు పుట్టుకు వస్తారు లేదా తీర్చిదిద్దబడతారు. అయితే, ఈ స్వాములందరికీ కొంతకాలమే మహర్దశ ఉంటుంది.

సత్యసాయిబాబానే తీసుకుందాం. యువతరం ఎవరూ ఆయనకు భక్తులుగా మారడం లేదు. పాత తరానికి చెందిన వాళ్లే ఆయనకు భక్తులుగా కొనసాగుతున్నారు. అభిరుచులను మార్చుకుంటున్నట్లుగానే దేవుళ్లు, స్వాముల విషయంలో కూడా భక్తుల అభిప్రాయాలు మారుతున్నాయి. ఇప్పటి తరం వాళ్లు షిరిడీ సాయిబాబాను ఆరాధించడం మొదలుపెట్టారు. కొంతకాలం క్రితం షిరిడీ సాయిబాబాకు అంతగా ఆదరణ ఉండేది కాదు.

సాధారణ మనుషులతోపాటు స్వాములు, బాబాలకే కాదు దేవాలయాలకు కూడా మహర్దశ కొంతకాలం పాటు ఉంటుంది. కొలిచే దేవుడు ఒకరే అయినా ఫలానా దేవాలయానికి వెళితే కోర్కెలు నెరవేరుతాయన్న నమ్మకం వ్యాపించడమే ఇందుకు కారణం. శ్రీ వేంకటేశ్వర స్వామినే తీసుకుందాం. దేవుడన్నాక ఎక్కడైౖనా దేవుడే కదా! ఇంతకాలం ఆదరణకు నోచుకోని చిలుకూరు బాలాజీ దేవాలయం ఇప్పుడు ఎందుకు పాపులర్ అయిందంటే, దేవాలయాలకు కూడా మహర్దశ అంటూ ఒకటుంటుందని నమ్మాలి.

ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ధోరణులు పెరిగిపోయిన ఈ రోజుల్లో గాడ్ అయినా గాడ్ మ్యాన్ అయినా మార్కెటింగ్ టెక్నిక్‌లకు అతీతులు కాదని నమ్మాల్సిందే! ఇదంతా చూస్తూ ఉంటే దేవుడు మనిషిని సృష్టించాడా? మనుషులే దేవుడిని సృష్టించారా? అన్న అనుమానం కలుగకమానదు. దేవుడిని నమ్ముకోకుండా, అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. మనది కర్మభూమి కనుక, తాంత్రికులు దేవుళ్లు అవుతారు. అవినీతిపరులు మహానేతలు, యువనేతలుగా కీర్తించబడతారు.

Saturday, 9 April 2011

లోక్‌పాల్'పై సంయుక్త కమిటీ... ఫలించిన హజారే దీక్ష..

దిగి వచ్చిన కేంద్రం జీ .. హజారే
అన్నా డిమాండ్లకు అంగీకారం
'లోక్‌పాల్'పై సంయుక్త కమిటీ
ఫలించిన హజారే దీక్ష.. 


చైర్మన్‌గా ప్రణబ్,సహాధ్యక్షుడిగా పౌర ప్రతినిధి
సభ్యులుగా మంత్రులు,పౌర ప్రతినిధులు
జూన్ 30లోపు ముసాయిదా బిల్లు
వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటుకు
రోజంతా హైడ్రామా.. సిబల్ దౌత్యం
సోనియా మన్మోహన్ తర్జన భర్జన..
ఒక్కడు... అదీ కురు వృద్ధుడు... అసలు సిసలైన భారతీయుడు! ఢిల్లీ సర్కార్ మెడలు వంచాడు! కేంద్రానికి ముచ్చెమటలు పట్టించాడు. 'జీ హుజూర్' అనక తప్పని పరిస్థితి కల్పించాడు. అవినీతిపై ఒంటరి పోరు మొదలుపెట్టి, యావద్భారతాన్ని కదిలించిన సామాజిక పోరాట యోధుడు అన్నా హజారే గెలిచారు. నాలుగు రోజులు అన్నం మానేసిన అన్నా... అనుకున్నది సాధించారు.

డిమాండ్లకు కేంద్రం ఓకే
1. జన లోక్‌పాల్ బిల్లు ముసాయిదాపై పది మందితో సంయుక్త కమిటీ ఏర్పాటవుతుంది. ఇందులో ప్రభుత్వం తరఫున ఐదుగురు, పౌర సంఘాల నుంచి ఐదుగురు ఉంటారు.

2. కమిటీకి కేంద్ర మంత్రి అధ్యక్షత వహిస్తారు. పౌర ప్రతినిధుల్లో ఒకరు సహాధ్యక్షుడిగా ఉంటారు.
3. జూన్ 30 లోపు ఈ బిల్లు ముసాయిదాను సిద్ధం చేస్తారు. జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు.

4. కమిటీకి రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తిని చైర్మన్‌గా నియమించడం కుదరదు. ప్రణబ్ లేదా ఒక సీనియర్ మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.

5. కమిటీ ఏర్పాటుపై వెంటనే నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇందులో అధ్యక్షుడు, సహాధ్యక్షుడు, సభ్యుల పేర్లతోపాటు కాలపరిమితినీ నిర్దేశిస్తారు.

న్యూఢిల్లీ , ఏప్రిల్ 8: కోరలు లేని, చేవ చచ్చిన లోక్‌పాల్ బిల్లు స్థానంలో... అవినీతిని దునుమాడే, అక్రమార్కులను చండాడే జన్ లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబట్టిన హజారే దీక్షకు కేంద్రం దిగి వచ్చింది. హజారే, ఇతర సామాజిక కార్యకర్తలు పెట్టిన ప్రతిపాదనలను దాదాపు... యథాతథంగా అంగీకరించింది. బహుశా... దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక కీలకమైన చట్టం తయారీలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేందుకు 'సరే' అంది.

లోక్‌పాల్ బిల్లు ముసాయిదా తయారీకి ప్రజా సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. అన్నా హజారే బేరసారాలకు లొంగకపోవడం, ప్రజా మద్దతు క్షణక్షణానికీ పెరుగుతుండటంతో కేంద్రం ఆయన చెప్పినట్లు వినింది. జన్ లోక్‌పాల్ బిల్లుపై హజారే చేపట్టిన దీక్ష శుక్రవారానికి నాలుగో రోజుకు చేరింది. 'తల తెగినా సరే... తల వంచను' అని హజారే విస్పష్టంగా ప్రకటించి తన వైఖరి ఏమిటో తేటతెల్లం చేశారు.

దీంతో శుక్రవారం ఉదయం నుంచే కేంద్రంలో ప్రకంపనలు మొదలయ్యాయి. 'దీక్ష విరమించండి. ప్రభుత్వంతో నేను మాట్లాడతాను' అని గురువారం హజారేను కోరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధాని మన్మోహన్‌ను కలిసి... ఎట్టి పరిస్థితుల్లో ఈ అనిశ్చితికి తెరవేయాలని సూచించారు. అటు... రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు.

'సమస్యను పొడిగించవద్దు' అని మన్మోహన్‌ను ఆమె ఆదేశించారు. దీంతో ప్రభుత్వం వైపు నుంచి రాయబారాలు ఊపందుకున్నాయి. కేంద్ర తరఫున మంత్రులు కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ, సల్మాన్ ఖుర్షీద్‌లు.. హజారే తరఫున ప్రతినిధులుగా వచ్చిన కేజ్రీవాల్, అగ్నివేశ్‌లతో పలు దఫాలుగా చర్చించారు. సంయుక్త కమిటీకి సరే అంటూనే... దీనిపై న్యాయశాఖ చేత ప్రకటన చేయిస్తామని మంత్రులు తెలిపారు. ఇందుకు హజారే ససేమిరా అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే కమిటీ వేయాలని తేల్చి చెప్పారు. చివరికి... సర్కారు ఈ డిమాండ్‌ను కూడా అంగీకరించింది.

తమ డిమాండ్లను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించిందని హజారే ప్రకటించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తాను దీక్ష విరమిస్తానన్నారు. దీనిని ప్రజా విజయంగా అభివర్ణించారు. తాను కమిటీలో సభ్యుడిగా మాత్రమే ఉంటానని హజారే స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సంతోష్ హెగ్డే (కర్ణాటక లోకాయుక్త), జస్టిస్ జేఎస్ వర్మల పేర్లను ప్రతిపాదించారు. అయితే... అధ్యక్ష పదవి స్వీకరించేందుకు హెగ్డే నిరాకరించారు.

జూన్ 30లోపు ముసాయిదా: సిబల్
హజారే నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి సిబల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది మన దేశ ప్రజాస్వామ్య శక్తికి సంకేతామన్నారు. చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని రుజువైందన్నారు. "ముసాయిదా కమిటీ జూన్ 30లోపు తమ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గం దీనిని ఆమోదించాలి.

జులై మొదటి వారంలో జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతాం'' అని సిబల్ ప్రకటించారు. కేంద్ర న్యాయ మంత్రి మొయిలీ కూడా విలేకరులతో మాట్లాడారు. "ముసాయిదా కమిటీని నియమిస్తూ వెంటనే ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేస్తాం. అందులో అధ్యక్ష, సహాధ్యక్షులతో పాటు మొత్తం పది మంది పేర్లను కూడా వెల్లడిస్తాం. కమిటీ నివేదిక ఎప్పట్లోపు ఇవ్వాలనే కాల పరిమితిని కూడా నిర్దేశిస్తాం'' అని చెప్పారు.

చర్చల మీద చర్చలు...
హజారే డిమాండ్లను అంగీకరించేందుకు ముందు కేంద్రం తర్జన భర్జనలు పడింది. శుక్రవారమంతా హైడ్రామా నడిచింది. 'లోక్‌పాల్ బిల్లువిషయంలో చొరవ తీసుకోండి' అంటూ ప్రధాని మన్మోహన్, సోనియాలకు హజారే శుక్రవారం మళ్లీ లేఖలు రాశారు. దీనిపై ప్రధాని... సోనియా, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, ప్రణబ్, ఖుర్షీద్, మొయిలీలతో చర్చించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌తో 35 నిమిషాల పాటు చర్చించారు.

సమస్యను పరిష్కరించే బాధ్యతను సిబల్, మొయిలీ, ఖుర్షీద్‌లకు అప్పగించారు. దీంతో హజారే ప్రతినిధులతో వీరు మరో విడత చర్చలు జరిపారు. హజారే పట్టు విడవకపోవడంతో... కేంద్ర ప్రభుత్వం ఒక్కో మెట్టు దిగుతూ వచ్చింది. ప్రణబ్‌ను కమిటీ అధ్యక్షుడిగా అంగీకరించబోమన్న డిమాండ్‌పైనా హజారేను సంతృప్తి పరుస్తూ... ప్రజా సంఘాల నుంచి ఒకరిని సహాధ్యక్షుడిగా నియమించేందుకు సరే అంది.

-- 

»мαнι ℓσνє'ѕ υ« ミℓινє ιт & ℓσνє ιт彡

జన లోక్‌పాల్ వస్తే పెద్ద తలలూ ఔట్?

కేంద్ర డజను మండలి
కేబినెట్‌లో ద్వాదశావతారాలు
కళంకిత ముద్రలు, అవినీతి ఆరోపణలు
జన లోక్‌పాల్ వస్తే పెద్ద తలలూ ఔట్?

అవినీతి, అధికారం! ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం. అందుకే... అవినీతిని నిర్మూలిద్దామంటే అధికారం ససేమిరా అంటుంది. 'నీవు లేక నేను లేను' అంటూ రాగం అందుకుంటుంది. అందుకే... 'అధికారం' జన లోక్‌పాల్ బిల్లుకు ససేమిరా అంటోంది. ఈ బిల్లు ఇప్పటికిప్పుడు చట్టంగా మారితే... కేంద్ర కేబినెట్‌లోని పలు పెద్ద తలకాయలే లేచిపోతాయి మరి! ఒకరా... ఇద్దరా! మన్మోహన్ మంత్రివర్గంలో 12 మంది అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు ప్రత్యక్ష కళంకితులైతే... 

మరికొందరు కళంకితులకు అండగా ఉంటున్న వారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలున్నా... వారిని ఏమీ చేయలేని పరిస్థితి. మొన్న జనవరిలో మంత్రివర్గంలో భారీ స్థాయిలో మార్పులు చేయాలని మన్మోహన్ అనుకున్నా... ఏ అవినీతి మంత్రిని తప్పించాలనే విషయంపై ఆయన, సోనియా తేల్చుకోలేకపోయారు. ఎవర్నీ మార్చకుండా కేవలం శాఖలు మార్చి, నలుగురైదుగురిని చేర్చి ఊరుకున్నారు. ఇప్పుడున్న కేబినెట్‌లో... 'బెంగాలీ బాబు' ప్రణబ్ దాదా నుంచి కర్ణాటక నేత వీరప్ప మొయిలీ దాకా 12 మందిపై పలురకాల ఆరోపణలున్నాయి.

కామన్వెల్త్ నుంచి 2జీ దాకా... హసన్ అలీ నుంచి రాజా దాకా! రూ.వేల కోట్ల కుంభకోణాలు! స్కాముల ఊబిలో కూరుకుపోయిన మన్మోహన్ సర్కారు.. అన్నా హజారే దీక్షతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి... మన్మోహన్ కేబినెట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పడింది. కేబినెట్‌లో కనీసం డజను మంది స్వయంగా అవినీతిపరులు కావడం లేదా అవినీతిపరులకు అండగా నిలిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బడా సంస్థల పెన్నిధి... ప్రణబ్ దా:
పెద్ద మనిషిలా, దేశంలో అన్ని వివాదాలను తానే పరిష్కరించే మేధావిలా వ్యవహరించే ప్రణబ్ నల్లధనం నుంచి.. ఆదాయపన్ను ఎగవేతదారుల వరకు ఎవరి గురించి ప్రశ్నించినా డొంకతిరుగుడు, దబాయింపు సమాధానాలతో తప్పించుకోగల దిట్ట. 1973 నుంచి కేంద్రమంత్రిగా ఉన్న ప్రణబ్ 1982లో ఆర్థిక మంత్రిగా ప్రపంచబ్యాంకు కితాబులందుకున్నారు. ఎమర్జెన్సీలో అత్యాచారాలకుగాను ఇందిరాగాంధీతో పాటు షా కమిషన్ ముందు హాజరైన ప్రణబ్.. దేశంలో బడా వ్యాపార సంస్థ రిలయన్స్‌కు అత్యంత సన్నిహితుడని అంటారు. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్‌లో ఏదో రూపేణా రిలయన్స్ లాంటి బడా సంస్థలకు వేల కోట్ల పన్ను రాయితీ కల్పించే ప్రణబ్‌పై నిర్దిష్ట అవినీతి ఆరోపణలు లేకపోయినా, స్వచ్ఛమైన వ్యక్తి అని చెప్పడం కష్టం.

మాయల మరాఠా... పవార్:
వేల కోట్లకు అధిపతైన శరద్ పవార్ కేంద్రంలో బలమైన మంత్రి. 20 ఏళ్ల క్రితం ముంబై మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ జీఆర్ ఖైర్నార్.. నాటి సీఎం పవార్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. పవార్ హయాంలో అవినీతి అధికారులను తొలగించాలని ఇదే హజారే ఒకప్పుడు నిరాహార దీక్ష చేశారు. పప్పూ కలానీ, హితే ంద్ర ఠాకూర్ లాంటి మాఫియా డాన్‌లను ఎన్నికల్లో నలిపిన ఘనత పవార్‌కే దక్కుతుంది. తెల్గీ స్టాంపుల స్కాం సహా అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 2జీ స్కాం నిందితుడు షాహిద్ బల్వాతో పవార్‌కు సంబంధముందని వార్తలొచ్చాయి. వ్యవసాయ మంత్రిగా వేల కోట్ల గోధుమల దిగుమతులు, పంచదార, ఉల్లిగడ్డల ధరల పెరుగుదల, తాజాగా క్రిమిసంహారక మందుల స్కాంలోనూ పవార్ హస్తం ఉన్నట్లు తేలింది.

కార్పొరేట్ ఏజెంట్... చిదంబరం:
సెక్యూరిటీల కుంభకోణంలో చిక్కుకున్న ఫైర్‌గ్రోత్ కంపెనీలో వాటాలున్నందుకు 1992లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన చిదంబరం బడా కార్పొరేట్ కంపెనీల ఏజెంట్‌గా ముద్రపడ్డారు. దేశానికి తీవ్ర నష్టం మిగిల్చిన ఎన్రాన్ విద్యుత్ సంస్థకు న్యాయవాదిగా వ్యవహరించారు. స్వచ్ఛందంగా ఆదాయాన్ని వెల్లడిస్తే ఆయా చట్టాల కింద శిక్ష పడదని 1997లో ఒక వివాదాస్పద పథకాన్ని ప్రవేశపెట్టగానే తన అక్రమ ఆదాయాన్ని వెల్లడించారు. ఆయన భార్య నళినీ చిదంబరంపైనా ఆరోపణలున్నాయి. ఆర్థిక మంత్రి అయ్యేవరకు బ్రిటిష్ మైనింగ్ కంపెనీకి వేదాంతకు డైరెక్టర్‌గా ఉన్న చిదంబరం.. దానికి న్యాయవాదిగా కూడా వ్యవహరించారు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి తన ఓటమిని 3,500 ఓట్ల గెలుపుగా మార్చుకున్న ఘనత ఈయనదే!

డీనోటిపికేషన్ వీర... కృష్ణ:
ఎస్ఎం కృష్ణ కర్ణాటక సీఎంగా ఉ న్నప్పుడు పలు అవినీ తి ఆరోపణ లు ఎదుర్కొన్నారు. వాటిలో ముఖ్యమైనవి.. బడా కంపెనీలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించేందుకు వాటిని డీ నోటిఫై చేయడం. కేంద్రం నుంచి పనికి ఆహార పథకం కింద వచ్చిన 17 వేల టన్నుల బియ్యాన్ని అక్రమంగా మళ్లించిన కుంభకోణంలో కృష్ణకు పాత్ర ఉన్నదని చెబుతారు. దీనిపై విచారణ చేయాలని కోర్టు ఆదేశించినా తమకు పనిభారం ఉందని సీబీఐ తప్పించుకుంది.

అబద్ధాల... షిండే:
అబద్ధాల కోరుగా.. మంత్రి పదవికి ఉన్న ప్రతిష్ఠను దిగజార్చిన వ్యక్తిగా అన్నా హజారే విమర్శించిన వ్యక్తి.. కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్‌కుమార్ షిండే. ఆదర్శ్ సొసైటీకి రాయితీలు కల్పించిన సీఎంలలో ఈయనా ఒకరు. దీనిపై రాష్ట్ర ఏసీబీలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఈ సొసైటీలో 51 పేర్లు చేర్చిన ఘనత షిండేకు దక్కుతుంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ షిండే ఈ ఫైలును ఆగమేఘాలపై ఆమోదింపచేశారు. ఈ సొసైటీకి మార్కెట్ విలువలో 20%కి భూమి కేటాయించిన ఘనతా ఆయనదే. ఎస్ఐ నుంచి రాష్ట్ర మం త్రిగా, సీఎంగా, గవర్నర్‌గా, కేంద్ర మంత్రి గా బాధ్యతలు నిర్వహించిన షిండే తొలుత శరద్‌పవార్ మనిషిగా ఉన్నా.. తర్వాత సోనియా విధేయుడయ్యా రు. బడాసంస్థలకు గుట్టుచప్పుడు కాకుకండా మేలుచేయడంలో ఆయనకు ఆయనే సాటి.

కుంభకోణాల వీరుడు.. విలాస్‌రావు:
ముంబై మీద ఉగ్రవాదుల దాడి తర్వాత.. సీఎం పదవికి రాజీనామా చేసి కేంద్రంలో మంత్రిగా చేరిన విలాస్‌రావు దేశ్ ముఖ్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ఒక కంపెనీకి అనుకూలంగా టెండర్ నిబంధనలను మార్చేందుకు విలాస్‌రావు ఆదేశాలిచ్చారని, ఈ కంపెనీలో ఆయనకు, ఆయన కుమారుడికే కాక సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కూ వాటాలున్నాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఆరోపించారు. తన ఆరోపణలు తప్పయితే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పిన గడ్కరీ.. పలు కీలక డాక్యుమెంట్లను శాసనమండలి చైర్మన్ శివాజీరావు దేశ్‌ముఖ్‌కు సమర్పించారు. పేద రైతులతో వడ్డీ వ్యాపారం చేసి అక్రమంగా ధనార్జన చేసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాపాడేందుకు విలాస్ జోక్యం చేసుకున్నారని సుప్రీంకోర్టే తీవ్రంగా విమర్శించింది. ముంబై హైకోర్టు విధించిన రూ.25వేల జరిమానాను రూ.10 లక్షలకు పెంచింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలోనూ దేశ్‌ముఖ్ హస్తం ఉంది.

బెయిల్‌పై కేంద్ర మంత్రి... వీరభద్ర:
హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో.. తన అవినీతి వ్యవహారాలు, కుంభకోణాల గురించి ఒక మాజీ అధికారితో మాట్లాడుతూ వీరభద్ర సింగ్ దొరికిపోయారు. వీరభద్ర సింగ్, ఆయన సతీమణి ప్రతిభ అవినీతి కార్యకలాపాలను వారి మాటలతోనే రికార్డు చేసిన ఒక సీడీ బయటకు విడుదల కావడంతో కోర్టు ఆదేశాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ విజిలెన్స్ బ్యూరో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. వివిధ పారిశ్రామికవేత్తలు, బ్యూరోకాట్ల నుంచి వీరభద్ర సింగ్, ఆయన సతీమణి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన వైనం బయటకు పొక్కింది. ప్రస్తుతం బెయిల్‌పైనే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న వీరభద్ర సింగ్ సాక్షులపై ఒత్తిడి తెస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని హిమాచల్ ప్రభుత్వం గురువారమే పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్రా నుండి ముడుపులు.. మొయిలీ:
1984లో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బైరెగౌడ అనే స్వతంత్ర ఎమ్మెల్యేకు రూ. 2 లక్షల లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణను న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఎదుర్కొన్నారు. ఈ కుంభకోణం.. మొయిలీ టేప్స్ పేరిట ప్రసిద్ధి చెందింది. తర్వాత సీఎంగా కూడా మొయిలీ పలు ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఎల్ఐసీ ఉద్యోగి నుంచి దేవరాజ్ అర్స్ శిష్యుడిగా మారి అంచెలంచెలుగా ఎదిగిన మొయిలీపై ఆరోపణలకు కొదవ లేదు. తెల్గీ స్టాంపుల కుంభకోణం, కలప కుంభకోణం, కొజింట్రిక్స్ కుంభకోణం లాంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పార్టీ తరఫున అసోం, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించిన మొయిలీ ఈ రాష్ట్రాల నేతల నుంచి భారీ ముడుపులు స్వీకరించారని, చివరివరకు జగన్‌ను కాపాడే ప్రయత్నం చేశారని అంటారు. మొయిలీ అకృత్యాలపై రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ నేత సోనియాకు రహస్య నివేదికను సమర్పించారు.

గుట్టు చప్పుడు కానివ్వని రవి:
కాంగ్రెస్ రాజకీయాల్లో పాత కాపు అయిన వాయలార్ రవి.. అవినీతి కార్యకలాపాలను కూడా గుట్టు చప్పుడు కాకుండా చేయడంలో దిట్ట అంటారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా పనిచేసిన రవి.. ఆయా రాష్ట్రాల నేతలకు యథాశక్తి తోడ్పాటు అందించి వారి 'మన్నన'లు అందుకున్న వ్యక్తి. ఈయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్నప్పుడే పీజేఆర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ సస్పెండ్ చేయించగలిగారు. వైఎస్‌కు పాదయాత్ర సలహా ఇచ్చింది కూడా రవే. కేరళలో మద్య లైసెన్సులు ఇప్పించి ముడుపులు పొందారని ఆరోపణలున్నాయి.

15%తో రోడ్డు ప్రాజెక్టులు... కమల్‌నాథ్:
1984లో సిక్కుల ఊచకోతలో ఆరోపణలు ఎదుర్కొన్న కమల్‌నాథ్.. రాజీవ్, సోనియాలకు విధేయుడు. 15% వాటా ఇస్తే చాలు..భారీ రహదారి ప్రాజెక్టులను ఆయన మంజూరు చేయగలరని సీఐఐకి చెందిన ఒక పారిశ్రామిక వేత్త కార్పొరేట్ లాబీయిస్టు నీరారాడియాతో అన్న విషయం టేపుల్లో వెల్లడైంది. స్వయంగా వ్యాపార వేత్త కమల్‌నాథ్ కులుమనాలీ వద్ద బియాస్ నది ఒడ్డున ఒక హోటల్ నిర్మించి పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు సుప్రీంకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది. వికీలీక్స్ కథనం ప్రకారం కమల్‌నాథ్ ఎంపీలకు ముడుపులు చెల్లించారని తేలింది. వాణిజ్యమంత్రిగా 500 ఎస్ఇజడ్‌లు కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.

ఇంట్లోనే ఎక్స్ఛేంజి... మారన్:
మన్మోహన్ కేబినెట్‌లో టెలికమ్యూనికేషన్ల మంత్రిగా దయానిధి మారన్ పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. టాటా డీటీహెచ్ ప్రాజెక్టు నుంచి తన సన్‌టీవీ నెట్‌వర్క్‌కు 33% వాటా కోరారని ఆరోపణలున్నాయి. సన్ టీవీ కోసం పెద్ద ఎత్తున డేటాను ప్రసారం చేసే 323 టెలిఫోన్ లైన్లను బీస్ఎన్ఎల్ ద్వారా పొందారని, తన ఇంట్లోనే టెలిఫోన్ ఎక్స్‌ఛేంజిని ఏర్పాటు చేయించుకోగలిగారని ఆరోపణలొచ్చాయి.ప్రైవేట్ మొబైల్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు అనేక చర్యలు తీసుకున్న మారన్ ఐటీ మంత్రిగా పలు కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించారు. మారన్ వల్ల బీఎస్ఎన్ఎల్‌కు 10వేల కోట్ల నష్టం వచ్చిందని ఆయన తర్వాత మంత్రి అయిన రాజాయే ఆరోపించారు.

ప్రైవేటు విమాన మిత్రుడు.. ప్రపుల్ పటేల్:
ఎన్‌సీపీకి చెందిన ప్రఫుల్‌పటేల్ నిన్నమొన్నటివరకు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం కలిగించారు. కింగ్ ఫిషర్, జెట్‌ల కోసం ఎయిరిండియాకు చెందిన పలు మార్గాలను రద్దుచేశారు. విమానాల రాకపోక ల సమయాన్ని మార్చారు. ఐపీఎల్ జట్లు ప్రయాణించేందుకు వీలుగా ప్రైవేట్ విమానాల కోసం చర్యలు తీసుకోవడంతో ఎయిరిండియా విమానాల ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. అసలు ప్రఫుల్ పటేల్.. కింగ్ ఫిషర్ కోసమే పనిచేశారని నీరారాడియా వ్యాఖ్యానించడం గమనార్హం.

-- 

»мαнι ℓσνє'ѕ υ« ミℓινє ιт & ℓσνє ιт彡

Friday, 8 April 2011

దీక్షా దక్షుడు.. అన్నా!
ఆత్మహత్య యోచన నుంచి.. ఆమరణ దీక్ష వరకు
స్ఫూర్తిదాయకం.. ఆజన్మ బ్మహ్మచారి జీవితం

లెక్కలేనన్ని దీక్షలు.. ప్రతిసారీ విజయమే
రాల్‌గావ్ సిద్ధిని సంస్కరించిన యోధుడు
రెండో స్వాతంత్య్ర పోరాటం కోసం పిలుపు
కదలివస్తున్న యావత్ భారత్‌దేశం
హైదరాబాద్, ఏప్రిల్ 7 : సొంత కుటుంబం లేదు.. నయాపైసా ఆస్తి లేదు.. బ్యాంకు బ్యాలెన్స్ అంతకంటే లేదు. మహారాష్ట్రలో తాను కలలు గని పునర్నిర్మించిన రాలెగావ్ సిద్ది గ్రామంలోని యాదవబాబా ఆలయానికి అనుబంధంగా ఉన్న చిన్న గదిలోనే నివాసం. ఖాదీ వస్త్రధారణ. కానీ.. ఆయన నోరు తెరిస్తే చాలు.. ప్రజాస్వామ్య విప్లవాగ్నులు రగులుతాయి. కాలు కదిపితే చాలు.. గ్రామాలు అభివృద్ధి పథం పడతాయి. తనను తాను ఫకీరుగా పిలుచుకునే ఆయన అసలుపేరు.. కిసాన్ బాబూరావ్ హజారే. అందరికీ తెలిసిన పేరు.. అన్నా హజారే. 

అవినీతిని అంతం చేయాలనే మహోన్నత లక్ష్యంతో దేశ రాజధానిలో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష.. కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఊరూ ఆయన బాటలోనే నడుస్తోంది. ఇప్పుడే కాదు.. ఆయన ఎప్పుడు దీక్ష ప్రారంభించినా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నాయకులు ఆయన దగ్గరకు వచ్చి.. సమస్యను పరిష్కరిస్తారు.

రాలెగావ్ సిద్ధి గ్రామంలో పశువులను ఆరుబయట వదిలేసే అలవాటు మాన్పించడానికి కూడా ఆయన 'నిరాహార దీక్ష'నే అస్త్రంగా ఉపయోగించారు. సామాన్యులు అందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించగల సామర్థ్యం ఆయనకే సొంతమన్న విషయాన్ని ఆయన వ్యతిరేకులూ అంగీకరిస్తారు. 1940 జనవరి 15న జన్మించిన ఆయన బాల్యం అంతా అస్తవ్యస్తంగానే గడిచింది. ఏడోతరగతి తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. 

1960లో సైన్యంలోకి ఎంపికయ్యారు. తొలినాళ్లలో పంజాబ్‌లో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేశారు. కుటుంబానికి, స్నేహితులకు.. అందరికీ దూరం కావాల్సి రావడంతో తీవ్ర నిరాశా నిస్పృహలతో ఆత్మహత్య చేసుకుందామని, లేఖ కూడా రాశారు. కానీ, చెల్లెలి పెళ్లి అయ్యేవరకు వాయిదా వేసుకున్నారు. ఈలోపు జరిగిన రెండు సంఘటనలు ఆయన జీవిత గమనాన్నే మార్చేశాయి. 1965 ఇండోపాక్ యుద్ధంలో ఆయన నడుపుతున్న ట్రక్కు మీదుగా పైన పాక్ విమానం ఎగురుతోంది. 

అది గమనించి సహచరులతో పాటు ఆయనా కిందకు దూకేశారు. విమానం నుంచి పడిన బాంబు పేలి ఆయన సహచరులందరూ మరణించినా.. హజారే బతికి బయటపడ్డారు. మరోసారి నాగాలాండ్‌లో పనిచేసేటప్పుడు అజ్ఞాత నాగాలు సైనిక గస్తీ కేంద్రంపై అర్ధరాత్రి దాడి చేసి.. అందరినీ హతమార్చారు. ఆ సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన హజారే మాత్రం బతికారు. 

ఈ రెండు సంఘటనలతో పాటు.. ఆయన ఎప్పటినుంచో చదివిన స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, ఆచార్య వినోబా భావేల పుస్తకాలు హజారే జీవిత గమనాన్ని మార్చేశాయి. సైన్యంలో ఉద్యోగవిరమణ చేసి.. 1975లో ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. తన కోసం ఏడ్చే కుటుంబం లేనప్పుడు.. దేశం కోసం మరణిస్తే సంతోషిస్తానని ఆజన్మ బ్రహ్మచారి అయిన హజారే అంటారు. 

అవినీతి, లంచగొండితనం, రెడ్ టేపిజం, నిజాయితీపరులైన అధికారులకు తరచు బదిలీలు.. ఇలాంటి వాటన్నింటి నుంచి విముక్తి పొందాలంటే మరో స్వాతంత్య్ర పోరాటం తప్పదని పిలుపునిచ్చారు. తీవ్రమైన కరువు, దారిద్య్రం, నేరాలు, తాగుడు వంటి వాటిలో కూరుకుపోయిన రాలెగావ్ సిద్ధిని ఆయన సంస్కరించారు. అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల కోసం ఆయన ప్రయోగించిన తొలి అస్త్రం.. నిరాహార దీక్షే. రాలెగావ్ సిద్ధిని తీర్చిదిద్దడంలో ఆయన చూపిన నిబద్ధతకు 1992లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. రామన్ మెగసెసె అవార్డు కూడా వరించింది.

అవినీతి మంత్రులకు ఉరి వేయాలి
అధికారం, ధనబలాలు జనాన్ని మత్తులో ముంచేస్తున్నాయి. రాజకీయ నాయకులు లోక్‌పాల్ బిల్లును కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆ బిల్లు వారి దోపిడీని అడ్డుకుంటుంది. 2జీ కుంభకోణం, కామన్‌వెల్త్ అక్రమాలు, ఆదర్శ్ హౌసింగ్ స్కామ్‌లు వెలుగులోకి వచ్చినా.. వాటికి కారకులైన వారికి మాత్రం జైలు శిక్షలు పడటం లేదు. అందుకే లోక్‌పాల్ బిల్లు కావాలి. 

అప్పుడే అవినీతి రాజకీయ నాయకులను జైలు కు పంపి, ఉరి తీయవచ్చు. గాంధేయ వాదినైన నేను ఉరి శిక్షల గురించి మాట్లాడటమేంటని అడగొచ్చు. కానీ.. పరిస్థితి ఎంత తీవ్ర దశకు చేరుకుందంటే.. మనం కేవలం గాంధీని అనుసరిస్తే సరిపోదు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌నూ అనుసరించాలి.
- దీక్షాశిబిరం వద్ద ప్రజలనుద్దేశిస్తూ అన్నా హజారే.


--

»мαнι ℓσνє'ѕ υ« ミℓινє ιт & ℓσνє ιт彡


Friday, 1 April 2011


దేశ జనాభా 121,01,93,422
పదేళ్లలో 18.1 కోట్ల జనాభా పెరుగుదల
గత 9 దశాబ్దాల్లో ఇదే తక్కువ

2011 జనాభా లెక్కల విడుదల
మొత్తంగా పెరిగిన లింగ నిష్పత్తి
వెయ్యికి 940 మంది మహిళలు
ఆందోళనకరంగా తగ్గిన బాలికల సంఖ్య

వెయ్యి మంది బాలురకు 914 మందే బాలికలు
అత్యధిక జనాభాతో ఉత్తరప్రదేశ్
అతి తక్కువ జనాభాతో లక్ష్యదీప్
74 శాతానికి పెరిగిన అక్షరాస్యత
అక్షరాస్యతలో అగ్రస్థానం కేరళదే
అథమ స్థానంలో బీహార్
ఢిల్లీ ఈశాన్య జిల్లాలో అధిక జనసాంద్రత
అత్యల్పం అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబంగ్ జిల్లా
ఇక్కడ చ.కి.మీ.కు నివసిస్తున్నది ఒక్కరే!
1872లో మొట్ట మొదటి సారి భారత జనాభాను లెక్కించారు. 2011లో జరిగిన జనగణన 15వది. ఈ దఫా గణనకు 2200 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. జనాభా లెక్కల సేకరణలో 27 లక్షల మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. ఈ ప్రక్రియకు మొత్తం 8వేల టన్నుల కాగితాన్ని ఉపయోగించారు. మరో 10,500 టన్నుల సామగ్రిని వాడారు. 2010 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ తొల దశ.. 2011 ఫిబ్రవరిలో మలి దశ గణన జరిగింది 

న్యూఢిల్లీ, మార్చి 31 : భారత జనాభా ఇప్పుడు 121 కోట్లు! ఇంకా కచ్చితంగా చెప్పాలంటే.. 121,01,93,422! ఇది అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్‌లలో ఉన్న మొత్తం జనాభాను కలుపుకొంటే వచ్చేంత! అంటే మొత్తం ప్రపంచ జనాభాలో మన జనాభా 17.5 శాతం. ప్రపంచ జనాభాలో 19.4 శాతాన్ని కలిగి చైనా అగ్ర స్థానంలో ఉండగా.. తదుపరి స్థానం భారత్‌కు దక్కింది. 

ఇందులో 62.27 కోట్ల మంది పురుషులు.. 58.65 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. గురువారం విడుదలైన 2011 జనగణన గణాంకాలు తేల్చి లెక్కలివి! గత పదేళ్ల కాలంలో 18.1 కోట్ల జనాభా పెరిగింది. గత 9 దశాబ్దాల కాలంలో కంటే ఈసారి జనాభా పెరుగుదల రేటు స్వల్పంగా ఉండటం ఇక్కడ విశేషం. 

ఈ దశాబ్దంలో పెరిగిన జనాభా.. బ్రెజిల్ జనాభాకు దాదాపు సమానం. 2001లో జనాభా పెరుగుదల రేటు 21.15 శాతం కాగా.. ఈ సారి అది 17.64 శాతమే. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, భారత జనాభా లెక్కల కమిషనర్ సీ చంద్రమౌళి విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. 

యూపీలో అధిక జనాభా
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక జనాభా కలిగినదిగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ రాష్ట్రంలో 19.9 కోట్ల మంది ఉన్నారు. అత్యంత తక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా లక్షద్వీప్ ఉంది. ఇక్కడ జనాభా కేవలం 64,429. యూపీ, మహారాష్ట్రల జనాభాను కలుపుకొంటే అమెరికా జనాభా కంటే ఎక్కువ. 

యూపీ తర్వాత మహారాష్ట్ర (11.23కోట్లు), బీహార్ (10.30కోట్లు), పశ్చిమ బెంగాల్ (9.13 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (8.46 కోట్లు) నిలిచాయి. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో అత్యధిక జనసాంద్రత ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 37,346 మంది ఉంటే, అరుణాచల్ ప్రదేశ్ దిబంగ్ లోయలో చ. కిలోమీటరుకు ఒకరే ఉన్నారు. 

బాలికల సంఖ్య తగ్గింది
చిన్నారుల విషయంలో బాలికల జనాభా కన్నా.. బాలుర జనాభాయే అధికంగా పెరుగుతూ వస్తోంది. బాలల లింగ నిష్పత్తిలో వెయ్యి మంది బాలురకు గాను 914 మంది బాలికలే ఉన్నారు. స్వాతంత్య్రానంతరం ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గత దశాబ్దంలో ఇది 1000-927గా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే హర్యానా, పంజాబ్‌లలో లింగ నిష్పత్తి తక్కువగా ఉంది. 

ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు గాను.. వరుసగా 830, 846 మంది బాలికలే ఉన్నారు. అత్యధిక నిష్పత్తి మిజోరం, మేఘాలయాల్లో ఉంది. అక్కడ వరుసగా వెయ్యి మంది బాలురకు గాను.. 971, 970 మంది బాలికలు ఉన్నారు. దేశం మొత్తం మీద అప్పుడే పుట్టిన బిడ్డలు మొదలుకుని.. ఆరేళ్లలోపు చిన్నారులు 15.88 కోట్లు. ఇది గడిచిన దశాబ్దం కంటే 50 లక్షలు తక్కువ. మొత్తంగా జనాభా లింగ నిష్పత్తిలో వెయ్యి మంది పురుషులకు గాను.. 940 మంది మహిళలు ఉన్నారు. 1971 జనాభా లెక్కల తర్వాత ఇదే అత్యధిక నిష్పత్తి. 

అక్షరాస్యత పెరిగింది
మొత్తం జనాభాలో ఏడు సంవత్సరాలు ఆ పై వయస్కుల్లో 74 శాతం మంది అక్షరాస్యులని లెక్కలు పేర్కొంటున్నాయి. 2001 జనాభా లెక్కలతో పోల్చితే అక్షరాస్యత 64.83 నుంచి 74.04 శాతానికి చేరుకోవడం ఓ శుభ పరిణామం. అంటే 9.21 శాతం పెరుగుదల నమోదైంది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. కేరళ, లక్షద్వీప్, మిజోరం, త్రిపుర, గోవా, డామన్-డియు, పుదుచ్చేరి, చండీగఢ్, ఢిల్లీ, అండమాన్-నికోబార్ దీవులు అక్షరాస్యత విషయంలో 85 శాతం పైబడి సాధించాయి. 

కేరళ అత్యధికంగా 93.91 శాతం అక్షరాస్యులను కలిగి ఉంది. ఆ తర్వాతి స్థానంలో లక్షద్వీప్ (92.28%) ఉంది. తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో బీహార్ అట్టడుగున (63.82%) నిలిచింది. జనాభా గణన అనంతర వర్గీకరణలు త్వరలోనే మొదలవుతాయని, వచ్చే ఏడాదికి తుది జనాభా లెక్కలు అందుబాటులోకి వస్తాయని చంద్రమౌళి తెలిపారు. ఇప్పుడు ఏమైనా పొరపాట్లు ఉంటే తుది జాబితాల్లో సవరిస్తామని వివరించారు. 2001 జనాభా లెక్కల నివేదికలో 2 శాతం తేడా వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
===============
»мαнι ℓσνє'ѕ υ« ●๋•Connecting People